Tooth pain home remedies
ఏ ఏ చెట్ల పుల్లలతో పళ్ళు తోముకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో మన ఆయుర్వేద ఋషులు ఎన్నో వేళా సంవత్సరాల నాదే చెప్పారు. తూర్పు వైపు గాని, పడమర వైపు గాని తిరిగి కూర్చొని పన్నెండు అంగుళాల పొడవు చిటికెన వేలంత మందము ఉన్న మొకం పుల్లతో, చిగుళ్లకు హాని జరగకుండా పళ్ళు తోముకోవాలి.
మర్రి పుల్లల్తో పండ్లు తోముకుంటే పండ్లకు శరీరానికి మంచి కాంతి కలుగుతుంది .
కానుగ పుల్లతో కడుక్కుంటే కార్యా సిద్ది కలుగుతుంది.
రేగు పుల్లతో కడుక్కుంటే మధురమైన కంఠ ధ్వని ఏర్పడుతుంది.
చండ్ర పుల్లతో కడుక్కుంటే నోటికి మంచి పరిమళం కలుగుతుంది.
మేడి, సంపెగ పుల్లతో పళ్ళు తోముకుంటే వాక్ సిద్ది , మంచి వినికిడి శక్తి కలుగుతుంది,
మామిడి పుల్లతో తోముకంటె దారణశక్తి పెరుగుతాయి.
దానిమ్మ పుల్లతో తోముకుంటే సౌందర్యాభివృద్ది జరుగుతుంది.
వేప పుల్లతో తోముకంటె సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి.
అయితే విపరీతమైన దంత రోగాలు కానీ , చెవి రోగాలు కానీ, ముక్కు వ్యాధులు కానీ, కంఠ వ్యాధులు కానీ, దగ్గులు గాని , గుండె జబ్బులు ఉన్న వాళ్లు గాని, దంత దావనానికి పుల్లలు వాడకూడదు.
వేప పుల్లల్ని కానీ, ఉత్తరేణి పుల్లల్నిగానీ నీడలో ఎండపెట్టి దంచి జల్లెడ పట్టి, మెత్తగా చూర్ణం తాయారుచేసుకొని ఆ చూర్ణం తో పండ్లు తోముకోవచ్చు.
తరువాత మొఖం కడుకోవటానికి ఉపయోగించే పుల్లని రెండు బద్దలుగా చీల్చి వాటితో నాలుకను శుభ్రంగా గీయాలి, లేకపోతే బంగారు, వెండి, లోయహం తో తయారు చేసిన పలుచటి బద్దలును అయినా ఉపయోగించవచ్చు. దీని వల్ల నోటి దుర్వాసన , రుచి తెలియకపోవడం , చిగుళ్ల వాపులు వంటివి అనేక సమస్యలు పరిష్కారమవుతాయి .
0 comments